Type Here to Get Search Results !

మటన్ బిర్యానీ - Mutton Biryani

 మటన్ బిర్యానీ:

కావలసినవి:

బాస్మతి బియ్యం - అర కిలో;

బిరియానీ ఆకు, నల్ల ఏలకులు, ఆకుపచ్చ ఏలకులు - 2 చొప్పున;

నువ్వులు - 2 టీ స్పూన్లు;

మిరియాలు, లవంగాలు - 6 చొప్పున;

దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ - కొద్దికొద్దిగా;

మెంతులు - టీ స్పూను;

ఉప్పు - 3 టీ స్పూన్లు;

మటన్ - కేజీ;

గరంమసాలా - టేబుల్ స్పూను;

అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు;

బొప్పాయి గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు;

పుల్ల పెరుగు - 4 టేబుల్ స్పూన్లు;

నిమ్మరసం - టీ స్పూను;

కారం, ఉప్పు - తగినంత;

ఉల్లితరుగు, టొమాటో ప్యూరీ,

చల్లటి పాలు - పావు కప్పు చొప్పున;

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు;

కుంకుమపువ్వు - కొద్దిగా;

నూనె - కొద్దిగా;

రోజ్ వాటర్ - రెండు చుక్కలు;

పచ్చిమిర్చి - 4;

ధనియాల పొడి, జీలకర్ర పొడి- టీ స్పూన్ చొప్పున;

పుదీనా, కొత్తిమీర - కొద్దిగా


తయారి:

ఒక పాత్రలో మటన్, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, బొప్పాయి గుజ్జు, కారం, నిమ్మరసం, గరంమసాలా వేసి మూడు గంటలపాటు మారినేట్‌చేయాలి.

బాణలిలో నూనె వేసి వేడయ్యాక, సగం ఉల్లితరుగు వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

పాన్‌లో నెయ్యి వేసి కరిగాక మిగిలిన ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరోమారు కలపాలి.

మ్యారినేట్ చేసిన మటన్ జత చేసి బాగా మగ్గిన తర్వాత, టొమాటో ప్యూరీ వేసి కలపాలి.

ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి కలపాలి.

మూడు కప్పుల నీరు పోసి మూత ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉంచాలి. (అవసరానికి తగ్గట్టు నీరు ఎక్కువ వేసుకుని, మాడకుండా చూసుకోవాలి)

పాన్ మూత తీసి ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర వేసి పది నిముషాలు ఉడికించాలి.


అన్నం తయారి:

బియ్యాన్ని 20 నిముషాలు నానబెట్టి కడిగి, నీరు ఒంపేయాలి.

ఒక వస్త్రంలో ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ ముక్క, మిరియాలు వేసి మూట కట్టాలి.

750 మి.లీ. నీటిని మరిగించి, అందులో బియ్యం, బిరియానీ ఆకు, ఉప్పు, మూట కట్టిన వస్త్రం ఉంచి అన్నం మూడు వంతులు ఉడికాక, నీరు ఒంపేసి, మూట తీసేయాలి.

ఒక కప్పులో పాలు, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.

ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక పాత్రకు కిందకు దింపి, పాత్ర అంతా అంటేలా పాత్రను కదపాలి.

ఉడికించిన బియ్యం, మటన్ ముక్కలు, కుంకుమపువ్వు పాలు, వేయించిన ఉల్లితరుగు, నెయ్యి వరుసగా ఒకదాని మీద ఒకటిగా లేయర్లుగా పరచాలి. మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా అమర్చాలి.

పైన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి గట్టి మూత ఉంచి స్టౌ మీద ఉంచాలి. 20 నిముషాల తర్వాత దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.




Top

Welcome To Our New Ui., 𝐑𝐚𝐭𝐞, 𝐑𝐞𝐯𝐢𝐞𝐰 𝐀𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐓𝐨 𝐄𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐔𝐬.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom